రెండు బైకుల ఢీ.. ఐదుగురి పరిస్థితి విషమం | five injured in road accident | Sakshi
Sakshi News home page

రెండు బైకుల ఢీ.. ఐదుగురి పరిస్థితి విషమం

Apr 22 2015 6:37 PM | Updated on Aug 30 2018 3:56 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

విజయనగరం: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కారాడ గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా జి.సిగడం మండలం గేదెలపేట గ్రామానికి చెందిన గేదెల వెంకటరమణ, కోటేశ్వర్‌రావు, శివ బైక్ పై బొబ్బిలికి బయలుదేరారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల పై ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండో వాహనం పైన ఉన్న ధనుంజయ్, సురేష్‌లు విజయనగరం జిల్లా మెరకముడిగాం మండలానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో వాహన రాకపోకలు లేకపోవడంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో తీవ్ర జాప్యం జరిగింది.

 

ఆదే సమయంలో అటుగా వెళ్తున్న వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు బాబినాయన తన వాహనాన్ని ఆపి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి అవసరమైన వాహనాలు సిద్ధం చేశారు. స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్నం తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement