కింది కోర్టు శిక్షను తగ్గించిన జిల్లా కోర్టు
కిందికోర్టు ఖరారు చేసిన శిక్షను జరిమానాగా సవరిస్తూ 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి కె.జయకుమార్ మంగళవారం తీర్పుచెప్పారు.
నరసరావుపేట టౌన్: కిందికోర్టు ఖరారు చేసిన శిక్షను జరిమానాగా సవరిస్తూ 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి కె.జయకుమార్ మంగళవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2007 ఆగస్టు 13వ తేదీన గుంటూరు రోడ్డులోని బాపూజీ లెబరేటరీపై ఔషధ నియంత్రణశాఖ అధికారులు దాడులు నిర్వహించి అనుమతులు లేకుండా ఔషధాలు విక్రయిస్తుండటాన్ని గుర్తించారు. సంబంధిత దుకాణ యజమాని షేక్ ఖాదర్మస్తాన్పై కేసు నమోదుచేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడిపై నేరం రుజువుకావటంతో మూడేళ్ల జైలు, రూ.55 వేలు జరిమానా విధిస్తూ 2013 ఫిబ్రవరి 19వ తేదీన తీర్పు చెప్పారు. ఈ తీర్పుపై నిందితుడు జిల్లా కోర్టుకు అప్పీలు చేసుకోగా, వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి రూ.1.30 లక్షల జరిమానా విధించి శిక్షను రద్దు చేశారు.