మంచిర్యాల జేసీ వాహనం ఢీకొని ఒకరికి.. | JC Manchiryal hit someone in the vehicle .. | Sakshi
Sakshi News home page

మంచిర్యాల జేసీ వాహనం ఢీకొని ఒకరికి..

Jan 23 2017 10:12 PM | Updated on Oct 9 2018 5:27 PM

పెద్దపల్లి బస్టాండ్‌ వద్ద రాజీవ్‌రహదారి దాటుతున్న ఓ వ్యక్తిని మంచిర్యాల జాయింట్‌ కలెక్టర్‌ సుధాకర్‌ వాహనం ఆదివారం

పెద్దపల్లిరూరల్‌ : పెద్దపల్లి బస్టాండ్‌ వద్ద రాజీవ్‌రహదారి దాటుతున్న ఓ వ్యక్తిని మంచిర్యాల జాయింట్‌ కలెక్టర్‌ సుధాకర్‌ వాహనం ఆదివారం ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక కమాన్‌ ప్రాంతంలో నివాసముండే బాల ఏసు (52) బస్టాండ్‌ ఎదురుగా రాజీవ్‌రహదారి దాటేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అవతలి వైపు వాహనం రావడం గమనించిన ఏసు వెనక్కి మళ్లడంతో జేసీ వాహనం అతడిని ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయమైన బాధితుడిని 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కరీంనగర్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement