మండలంలోని బేలోడుకు చెందిన ఈడిగ అంజినమ్మ, వన్నూరప్ప దంపతుల కుమారుడు ఆంజినేయులు(15) ఎట్టకేలకు గురువారం మృతి చెందినట్లు ఎస్ఐ హైదర్వలి తెలిపారు.
బళ్లారి విమ్స్లో చికిత్స పొందిన అనంతరం స్వగ్రామానికి వచ్చాడు. ఆ తరువాత రెగ్యులర్ చెకప్ కింద రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో అతను మరణించడంతో తల్లిదండ్రులు విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.