రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం | In Road Accident Younger Died | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

Aug 19 2016 10:57 PM | Updated on Aug 30 2018 4:07 PM

పులివెందుల – ముద్దనూరు ప్రధాన రహదారిలోని ఇనగలూరు బస్టాఫ్‌ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు.

తొండూరు : పులివెందుల – ముద్దనూరు ప్రధాన రహదారిలోని ఇనగలూరు బస్టాఫ్‌ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బూచుపల్లెకు చెందిన కోలిగాళ్ల గురుభాస్కర్‌(28) అత్తగారి ఊరైన వేంపల్లెకు ద్విచక్ర వాహనంలో సాయంత్రం బయలుదేరారు. ఇనగలూరు బస్టాఫ్‌ వద్ద ప్రొద్దుటూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మొరాయించి నిలిచిపోయింది. పులివెందుల వైపు నుంచి వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఘటన స్థలంలోనే గురుభాస్కర్‌ మృతి చెందాడు. ఆయన ట్రాక్టర్‌ డ్రైవర్‌గా జీవనం సాగిస్తుండేవాడు. మృతుని భార్య వరలక్ష్మి వేంపల్లెలోని తల్లి ఇంటి వద్ద ఉంది. ఆమె వద్దకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుడికి కుమారులు యోగేంద్ర,, బాబు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు గుర్రప్ప, అంకాలమ్మ సంఘటనా స్థలం వద్ద బోరున విలపించారు. తొండూరు ఇన్‌చార్జి ఎస్‌ఐ నరసింహారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement