కృష్ణా జిల్లాలో భారీ వర్షం


మచిలీపట్నం : నైరుతి రుతుపవనాల ప్రభావంతో కృష్ణా జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 49.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా మైలవరంలో 94.8 మిల్లీమీటర్లు, అత్యల్పంగా చందర్లపాడు 6.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడలో 61.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీవర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం మధ్యాహ్నం వరకు వర్షం కురవటంతో జనజీవనం స్తంభించింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top