కర్నూలు మీదుగా నడుస్తున్న రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
గోరక్పూర్ ఎక్స్ప్రెస్ రైళ్ల రద్దు
Nov 20 2016 12:59 AM | Updated on Sep 4 2017 8:33 PM
కర్నూలు(రాజ్విహార్): కర్నూలు మీదుగా నడుస్తున్న రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అభివృద్ధి పనులు చేపడుతున్న కారణంగా ఈనెల 24, డిసెంబర్ 1న, 8వ తేదీల్లో గోరక్పూర్ నుంచి యశ్వంత్ పూర్కు నడిచే రైలు నెంబర్ 15023, ఈనెల 25, డిసెంబర్ 2న, 9వ తేదీల్లో యశ్వంత్పూర్ నుంచి గోరక్పూర్కు నడిచే రైలు నెంబర్ 15024ను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని కోరారు.
Advertisement


