
షి'కారు'జూదం
జిల్లాలో పేకాట కొత్తపుంతలు తొక్కుతోంది. ఇప్పటి వరకూ మారుమూల ప్రాంతాల్లో మూడోకంటికి తెలియకుండా పేకాట ఆడడం తెలుసు. కానీ కార్లలో షి‘కారు’ చేస్తూ పేకాట ఆడడడం కొత్త విధానం. నగరశివారు ప్రాంతాలు, బీకేఎస్లే అడ్డా. జిల్లా కేంద్రంలో ఇలాంటి మొబైల్ కేంద్రాలు నడిపిస్తున్న వారు ఐదుగురు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. నవోదయకాలనీ, బైపాస్ రోడ్డు లో ఉంటున్న మరో వ్యక్తి మొబైల్ వాహనాలకు నాయకత్వం వహిస్తున్నట
- నగరశివారు ప్రాంతాలు, బీకేఎస్ మండల కేంద్రమే అడ్డా
- ∙రోజూ రూ. కోట్లలో లావాదేవీలు
- ∙అధికారపార్టీ సానుభూతిపరులే అధికం
జిల్లాలో పేకాట కొత్తపుంతలు తొక్కుతోంది. ఇప్పటి వరకూ మారుమూల ప్రాంతాల్లో మూడోకంటికి తెలియకుండా పేకాట ఆడడం తెలుసు. కానీ కార్లలో షి‘కారు’ చేస్తూ పేకాట ఆడడడం కొత్త విధానం. నగరశివారు ప్రాంతాలు, బీకేఎస్లే అడ్డా. జిల్లా కేంద్రంలో ఇలాంటి మొబైల్ కేంద్రాలు నడిపిస్తున్న వారు ఐదుగురు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. నవోదయకాలనీ, బైపాస్ రోడ్డు లో ఉంటున్న మరో వ్యక్తి మొబైల్ వాహనాలకు నాయకత్వం వహిస్తున్నట్లు తెలి సింది.
ఒక్కొక్కరి నుంచి రూ. 1500 చొప్పున వసూలు చేసి, ఇటు ధర్మవరం, అటు బళ్లారి వరకూ మొబైల్ వాహనాల్లో పేకాట ఆడిస్తున్నట్లు తెలుస్తోంది. పేకాట ఆడిస్తున్న వారిలో అధికారపార్టీకి చెందిన వారే అధికంగా ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల విద్యార్థి విభాగం నాయకులు రెడ్హ్యాండెడ్గా పట్టుబట్టారు. అందులో చోటామోటా నేతలతో పాటు, వారి సానుభూతి పరులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని సందర్భాల్లో పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా ఎవరికీ తెలియకుండా వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి.
చూసీ చూడనట్లు పోతున్న పోలీసులు
ఈనెల 24న నగరంలోని కమలానగర్లో ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తుండగా వన్టౌన్ పోలీసులు దాడి చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో అధికార పార్టీకి చెందిన అనుబంధ టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా వారిని అరెస్టు చేసి, బెయిల్పై విడుదల చేశారు.
గత నెలలో హౌసింగ్ బోర్డులో అర్ధరాత్రి పేకాట స్థావరంపై నిర్వహించిన పోలీసుల దాడుల్లో ఒకేసారి 30 మందికిపైగా పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 1.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పది రోజుల వ్యవధిలో నగరంలో నాలు గు పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు పది కేసులు నమోదు కాగా 50 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు.
బీకేఎస్, శివారు ప్రాంతాల్లో యథేచ్ఛగా జూదం
పేకాటకు నగర శివారు ప్రాంతాలు, బుక్కరాయసముద్రం మండలంలో పలు ప్రాంతాలను అడ్డాగా చేసుకున్నట్లు తెలుస్తోంది. సదరు మండలంలో జెడ్పీ ఉన్నతపాఠశాల పక్కన ఓ హోటల్లో పేకాట, మట్కా జోరుగా సాగుతోంది. మండలంలోని బీటర్లు అక్కడే మకాం వేస్తుంటారు. జిల్లా కేంద్రం నుంచి కూడా అక్కడికి వెళ్లి పేకాట ఆడుతున్న వారు చాలా మందే ఉన్నారు. అవసరమైతే రహస్య ప్రాంతానికి వెళతారు.. లేదంటే ఓ హోటల్లోనే నిర్వహిస్తారు. రూ. 10 వడ్డీతో డబ్బు పంపకాల్లో రెండ్రోజుల క్రితం భారీ గొడవ జరిగినా విషయం బయటకు పొక్కకుండా దాచారు. నగర శివారు ప్రాంతాల్లో జోరుగా పేకాట ఆడిస్తున్నారు. హెచ్చెల్సీ కాలువ వెంబడి పేకాట స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.