కర్నూలులో మాజీ డీజీపీ | former DGP in Kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలులో మాజీ డీజీపీ

Jun 5 2017 12:05 AM | Updated on Aug 20 2018 3:37 PM

హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్కావరా స్వగ్రామం అనంతపురం జిల్లాకు వెళ్తూ ఆదివారం సాయంత్రం మాజీ డీజీపీ జేవీ రాముడు కర్నూలులో ఆగారు.

కర్నూలు :  హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్కావరా స్వగ్రామం అనంతపురం జిల్లాకు వెళ్తూ ఆదివారం సాయంత్రం మాజీ డీజీపీ జేవీ రాముడు కర్నూలులో ఆగారు.  ఏపీఎస్‌పీ బెటాలియన్స్‌ మూడో రేంజ్‌ డీఐజీ గోగినేని విజయ్‌కుమార్, కమాండెంట్‌ శామ్యుల్‌జాన్, ఎస్పీ ఆకె రవికృష్ణ తదితరులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. స్థానిక అతిథిగృహంలో కొద్దిసేపు సమావేశమై జిల్లాలోని శాంతిభద్రతల సమస్యలపై చర్చించారు. ఎస్పీ దత్తత గ్రామం కప్పట్రాళ్లలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయంటూ ఆరా తీశారు. ఇటీవల కాలంలో జిల్లాలో చోటు చేసుకున్న ఫ్యాక‌్షన్‌ హత్యల విషయంపై కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. 
 

Advertisement
 
Advertisement
Advertisement