హిందూపురం రూరల్ : పార్టీని భ్రష్టుపట్టించి, ప్రజాధనాన్ని దోచుకుని పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే పీఏ శేఖర్ మళ్లీ హిందూపురానికి వస్తే సహించేది లేదని టీడీపీ అసమ్మతి నేతలు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు.
హిందూపురం రూరల్ : పార్టీని భ్రష్టుపట్టించి, ప్రజాధనాన్ని దోచుకుని పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే పీఏ శేఖర్ మళ్లీ హిందూపురానికి వస్తే సహించేది లేదని టీడీపీ అసమ్మతి నేతలు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. సోమవారం అంబికా లక్ష్మీనారాయణ నివాసంలో మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడితోపాటు నలుగురు కౌన్సిలర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పీఏ శేఖర్ మళ్లీ హిందూపురానికి వస్తే ఆందోâýæనలు చేస్తామని స్పష్టం చేశారు.
శేఖర్తో టీడీపీకి తీవ్ర నష్టం జరిగిందని, పార్టీకి చెడ్డపేరు వచ్చిందన్నారు. పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబునాయుడు, బాలకృష్ణ ఆదేశాలకనుగుణంగా తాము నడుచుకోవడానికి సిద్ధమైన పక్షంలో మళ్లీ శేఖర్ గుట్టు చప్పుడుకాకుండా రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇప్పటిౖకెనా అధిష్టానం శేఖర్ను తొలగించినట్లా.. లేదా అన్న విషయం స్పష్టం చేయాలన్నారు. రెండురోజులుగా శేఖర్ బాగేపల్లిలో మకాం వేసి, తాను మళ్లీ నెలరోజుల్లో వస్తానని లేపాక్షి, చిలమత్తూరు నాయకులకు చెప్పారని అన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు సనావుల్లా భారతి, గోపీ, శివ, మాజీ కౌన్సిలర్లు ముద్దరంగప్ప, చక్రపాణి, పరిమâýæ, నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.