డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలకు నోటిఫికేషన్‌ విడుదల | Sakshi
Sakshi News home page

డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలకు నోటిఫికేషన్‌ విడుదల

Published Thu, Aug 24 2017 9:46 PM

degree supplementary notification release

ఎస్కేయూ: ఎస్కేయూ పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ మొదటి, రెండు, మూడేళ్ల సప్లమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి  నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు  డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యూషన్‌ ప్రొఫెసర్‌ శ్రీరాములు  ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్‌ 14 దరఖాస్తు చివరి తేదీగా నిర్ణయించామన్నారు. రూ.150 అపరాధ రుసుంతో 18 వరకూ, రూ.500 అపరాధ రుసుంతో సెప్టెంబర్‌ 22వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలన్నారు. కర్నూలు జిల్లా విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement
Advertisement