ఆంధ్రాబ్యాంకును ముట్టడించిన ఖాతాదారులు | customers attak andhra bank at bandarulanka | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంకును ముట్టడించిన ఖాతాదారులు

Nov 29 2016 11:55 PM | Updated on Sep 4 2017 9:27 PM

గత వారం రోజులుగా తమ గ్రామంలోని ఆంధ్రాబ్యాంకులో ‘నో క్యాష్‌’ అనే బోర్డు కు మోక్షం కలగకపోవడంతో బండార్లంక వినియోగదారులు ఆ బ్యాంకును ముట్టడించటమే కాకుండా బ్యాంకు ముందు మంగళవారం నిరసన తెలిపి అధికారులతో వాగ్వివాదానికి దిగారు. పెద్ద నోట్ల

  • బండార్లంకలో ప్రజలు నిరసన  ∙బ్యాంకు అధికారులతో వాగ్వివాదం
  • అమలాపురం రూరల్‌ : 
    గత వారం రోజులుగా తమ గ్రామంలోని ఆంధ్రాబ్యాంకులో ‘నో క్యాష్‌’ అనే బోర్డు కు మోక్షం కలగకపోవడంతో బండార్లంక వినియోగదారులు ఆ బ్యాంకును ముట్టడించటమే కాకుండా బ్యాంకు ముందు మంగళవారం నిరసన తెలిపి అధికారులతో వాగ్వివాదానికి దిగారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల కష్టాలు ఎవరూ పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. బ్యాంకు మేనేజర్‌ కేవీఎ¯ŒS ప్రసాద్‌తో ఖాతాదారులు వాగ్వివాదానికి దిగారు. బ్యాంకులో నగదు లేకపోవటం వల్ల ఈ పరిస్థితి ఎదురైందని వివరణ ఇచ్చుకున్నారు. రూ.15 లక్షలు నగదు వస్తేనే ఖాతాదారులకు చెల్లింపులు చేస్తామన్నారు. బ్యాంకులో వ్యాపారులు కూడా కొత్త నోట్లు, చిల్లర నోట్లు డిపాజిట్‌ చేయకపోవటం వల్ల కూడా ఈ పరిస్థితి అనివార్యమైందన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement