పాపం పండుటాకులు
కృష్ణవేణి ఘాట్లో దంపతులఆత్మ హత్యాయత్నం
భర్త మృతి... విషమంగా భార్య
విజయవాడ (కృష్ణలంక) :
ఆ దంపతులకు ఏం కష్టం వచ్చిందో.. ఎక్కడివారో.. కలిసే ఆత్మహత్యాయత్నం చేయగా, భర్త మరణించగా, భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మంగళవారం కృష్ణలంకలో ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీతమ్మవారిపాదాల వద్ద ఉన్న కృష్ణవేణి ఘాట్లో పురుగుల మందు తాగి సుమారు 60, 55 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని దంపతులు ఆపస్మారకస్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని 108 అంబులెన్సు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతు భర్త మృతిచెందగా, భార్య కోమాలోకి చేరుకుంది. వారికి సంబంధించిన ఎటువంటి వివరాలు తెలియలేదని పోలీసులు చెప్తున్నారు. వీరి వివరాలు తెలిసినవారు కృష్ణలంక పోలీస్స్టేçÙన్లో తెలియజేయాలన్నారు.