బోటింగ్‌ శిక్షణ అకాడమీ ఏర్పాటుకు కృషి | Boating effort to establish the training academy | Sakshi
Sakshi News home page

బోటింగ్‌ శిక్షణ అకాడమీ ఏర్పాటుకు కృషి

Sep 19 2016 11:32 PM | Updated on Apr 3 2019 5:26 PM

బోటింగ్‌ శిక్షణ అకాడమీ ఏర్పాటుకు కృషి - Sakshi

బోటింగ్‌ శిక్షణ అకాడమీ ఏర్పాటుకు కృషి

మండల పరిధిలోని మిడ్‌పెన్నార్‌ (ఎంపీఆర్‌డ్యాం)లో బోటింగ్‌ శిక్షణ అకాడమి ఏర్పాటుకు కృషి చేస్తామని ఒలంపిక్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మిడ్‌పెన్నార్‌ డ్యాంను జేసీ పవన్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు.

  • ఒలంపిక్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి
  • గార్లదిన్నె: మండల పరిధిలోని మిడ్‌పెన్నార్‌ (ఎంపీఆర్‌డ్యాం)లో బోటింగ్‌ శిక్షణ అకాడమి ఏర్పాటుకు కృషి చేస్తామని  ఒలంపిక్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మిడ్‌పెన్నార్‌ డ్యాంను జేసీ పవన్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా యన మాట్లాడుతూ డ్యాం పరిసర ప్రాంతాల్లో దాదాపు 200 బెస్త కుటుం బాలు ఉన్నాయని, వీరికి బోటింగ్‌పై శిక్షణ ఎంతో అవసరమన్నారు.  క్రీడల పట్ల ఉత్సాహంగా ఉన్న ప్రతి ఒక్కరికి బోటింగ్‌పై శిక్షణ ఇచ్చే విధంగా భ విష్యత్తులో ఇంటర్నేషనల్‌ కోచ్‌ ఆధ్వర్యంలో బోటింగ్‌ శిక్షణ అకాడమిని ఏ ర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో కెనాయింగ్‌ రాష్ట్ర అధ్యక్షులు వినిల్‌రెడ్డి, ఉపాధ్యక్షులు రాజశేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు రవి ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

     

     

Advertisement
 
Advertisement
Advertisement