రోడ్డు ప్రమాదంలో బీట్‌ ఆఫీసర్‌ మృతి | Beat Officer killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బీట్‌ ఆఫీసర్‌ మృతి

Aug 13 2016 9:46 PM | Updated on Aug 30 2018 4:07 PM

మృతిచెందిన వెంకటేశ్వర్లు - Sakshi

మృతిచెందిన వెంకటేశ్వర్లు

రోడ్డు ప్రమాదంలో అటవీ శాఖ బీట్‌ ఆఫీసర్‌ మృతిచెందిన సంఘటన కుదునూరులో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

కుదునూరు(చర్ల) : రోడ్డు ప్రమాదంలో అటవీ శాఖ బీట్‌ ఆఫీసర్‌ మృతిచెందిన సంఘటన కుదునూరులో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దుమ్ముగూడెం అటవీ శాఖ రేంజ్‌ పరిధిలోని బోదనెల్లి సెక్షన్‌లో గల ఆర్‌.కొత్తగూడెం బీర్‌లో బీట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పాయం వెంకటేశ్వర్లు(51) ఆర్‌.కొత్తగూడెం నుంచి భద్రాచలం వైపునకు తన బైక్‌ వెళ్తున్నాడు. ఈ క్రమంలో కుదునూరు దాటుతుండగా.. రోడ్డు పక్కన నాగలితో వెళ్తున్న ఎద్దులను తప్పించబోయి.. నాగలి కాడికి బైక్‌ హ్యాండిల్‌ తగిలి కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరాడు. స్థానికులు 108 వాహనంతోపాటు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. 108 వచ్చేలోపే స్థానికుల సాయంతో అటవీ శాఖ సిబ్బంది క్షతగాత్రుడిని ఆటోలో సత్యనారాయణపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి 108 వాహనంలో భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వెంకటేశ్వర్లు మృతిచెందాడు. కాగా, వాజేడు మండలం చినగొల్లగూడెంకు చెందిన వెంకటేశ్వర్లు.. రాజుపేటలో నివాసం ఉంటూ ఆర్‌.కొత్తగూడెం బీట్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మృతదేహాన్ని పలువురు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సందర్శించి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement