సిరిసిల్ల : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతిష్ఠాత్మకమైన ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం–2016’కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని అవార్డు కమిటీ అధ్యక్షులు రంగినేని మోహన్రావు, కన్వీనర్ మద్దికుంట లక్ష్మణ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు.
‘రంగినేని’ సాహిత్య పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం
Sep 10 2016 11:49 PM | Updated on Nov 6 2018 4:04 PM
సిరిసిల్ల : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతిష్ఠాత్మకమైన ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం–2016’కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని అవార్డు కమిటీ అధ్యక్షులు రంగినేని మోహన్రావు, కన్వీనర్ మద్దికుంట లక్ష్మణ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. 2014, 2015, 2016 సంవత్సరాల్లో ప్రచురితమైన తెలుగు కథా సంపుటానికి అవార్డు అందిస్తామని పేర్కొన్నారు. అక్టోబరు 31లోగా ఐదు ప్రతులను ట్రస్ట్కు అందేవిధంగా పంపాలని కోరారు. అవార్డు కింద రూ.15వేల నగదు, జ్ఞాపిక, శాలువ, పురస్కార పత్రాన్ని 2017 జనవరిలో జరిగే అవార్డు ప్రదానోత్సవంలో అందిస్తామని వారు వెల్లడించారు. ఇతర వివరాలకు 94416 77373 సంప్రదించాలని సూచించారు.
Advertisement


