రామాయంపేట 48 గంటల బంద్ | 48-hour bandh in Ramayampeta | Sakshi
Sakshi News home page

రామాయంపేట 48 గంటల బంద్

Oct 13 2016 12:58 PM | Updated on Sep 4 2017 5:05 PM

మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు ఉధృతమయ్యాయి.

మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు ఉధృతమయ్యాయి. అఖిలపక్షాల పిలుపు మేరకు గురువారం ఉదయం నుంచి 48 గంటల బంద్ మొదలైంది. వర్తక, వ్యాపార కేంద్రాలు మూతబడ్డాయి. బస్సులు పట్టణంలోకి రాకుండా బైపాస్‌నుంచే వెళ్తున్నాయి. బంక్‌లు, బ్యాంక్‌లు పనిచేయటం లేదు. స్థానిక యువకులు ముగ్గురు సెల్‌టవర్ ఎక్కారు. డివిజన్‌గా ప్రకటించకుంటే దూకుతామని బెదిరిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement