తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని కాంచిపురం జిల్లా సమ్మల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ బస్సు వ్యాన్ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు కావడం గమనార్హం. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్లో 16 మంది ఉన్నారు. క్షతగాత్రులను 108లో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.