ఎమ్మెల్యే హత్య: బీజేపీ నేతపై కేసు నమోదు | Police Filed FIR On BJP Leader Mukul Roy | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే హత్య: బీజేపీ నేతపై కేసు నమోదు

Feb 10 2019 1:10 PM | Updated on Feb 10 2019 7:18 PM

Police Filed FIR On BJP Leader Mukul Roy - Sakshi

కోల్‌కత్తా: తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సత్యజిత్‌ బిశ్వాస్‌ హత్యకేసులో బీజేపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేత ముకుల్‌ రాయ్‌పై కేసు నమోదు అయినట్లు నదియా పోలీసులు తెలిపారు. కృష్ణగంజ్‌ శాసన సభ్యుడైన బిశ్వాస్‌ను శనివారం రాత్రి దుండుగులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. బిశ్వాస్‌ హత్యపై టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని వెనుక ముకుల్‌ హస్తం ఉందని ఆపార్టీ నేత శివశంకర్‌ ఆరోపించారు.

పార్టీ ముఖ్యనేతల ఫిర్యాదు మేరకు ముకుల్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇదివరకే ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా ముఖుల్‌ రాయ్‌ గత ఏడాదే టీఎంసీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మమతా బెనర్జీకి విధేయుడిగా ఉన్న ముకుల్‌ ఆమెతో విభేదించి బీజేపీ గూటికి చేరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement