గర్భిణిపై ముగ్గురి లైంగికదాడి | Molestation on Pregnant Woman in Tamil Nadu | Sakshi
Sakshi News home page

గర్భిణిపై ముగ్గురి లైంగికదాడి

Dec 14 2019 10:50 AM | Updated on Dec 14 2019 10:50 AM

Molestation on Pregnant Woman in Tamil Nadu - Sakshi

తమిళనాడు ,అన్నానగర్‌ :  కడలూర్‌లో భర్తతో వస్తున్న 5నెలల గర్భిణిని కిడ్నాప్‌ చేసి లైంగికదాడికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. పుదుప్పాలైయమ్‌ ప్రాంతానికి చెందిన 21ఏళ్ల మహిళ.. ఈమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో కలిసి కడలూర్‌లోని ఓ థియేటర్‌లో సినిమా చూసి తిరిగి వస్తుండగా కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. భర్తపై విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను బలవంతగా ఎత్తుకెళ్లారు. కమ్మియమ్‌పేటలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. తర్వాత ఆ మహిళను కారులోనే తీసుకొచ్చి ఇంటి సమీపంలో వదిలివెళ్లిపోయారు. దీనిపై బాధితురాలు పుదునగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు ఎస్పీ శాంతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement