దారుణం: ఒకే యువతిపై రెండు సార్లు గ్యాంగ్‌రేప్‌

In Haryana 17 Year Girl Molested By Four Men - Sakshi

చంఢీఘర్‌: ఒకే యువతి అయిదునెలల వ్యవధిలో రెండుసార్లు అత్యాచారానికి గురైన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. పాల్వాల్‌ జిల్లాలో 17 సంవత్సరాల యువతిని నలుగురు వ్యక్తులు ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి బుధవారం రాత్రి ఇంటి ముందు తిరుగుతుండగా నలుగురు వ్యక్తులు ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితులంతా బాధితురాలి ఊరికి చెందినవారే కావడం గమనార్హం.

ఆ యువతిని అదే నిందితులు గత ఆగస్టు 13న కూడా అత్యాచారం చేశారు. ఆ సమయంలో తల్లిదండ్రులకు విషయం చెప్పగా వారు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా గ్రామ పెద్దలు సర్దిచెప్పడంతో బాధితురాలు కేసును ఉపసంహరించుకుంది. ఇదే అదునుగా భావించిన నిందితులు సదరు బాధితురాలిని డిసెంబర్ 4న కూడా అత్యాచారం చేశారు. ఈ విషయంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి వైద్యపరీక్షలు పూర్తిచేసినట్లు పాల్వాల్ ఉమెన్ పోలీస్‌స్టేషన్‌ ఇంఛార్జ్ హీరా మణి తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top