ఘోర రోడ్డు ప్రమాదం.. వరుడి తల్లి మృతి | Four Persons Died In Anantapur Road Accident | Sakshi
Sakshi News home page

పెళ్లి ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన లారీ.. 4గురు మృతి

Apr 24 2018 10:41 PM | Updated on Aug 30 2018 4:20 PM

Four Persons Died In Anantapur Road Accident - Sakshi

సాక్షి, అనంతపురం : పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన జిల్లాలోని ఓడీసీ మండలం గాజుకుంటపల్లి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలివి.. పెళ్లి ట్రాక్టర్‌ దిగువపల్లి నుంచి కదిరికి వెళ్తోంది. వేగంగా ప్రయాణిస్తున్న లారీ పెళ్లి ట్రాక్టర్‌ను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా, పలువురు గాయలయ్యాయి.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.  

గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్న వారిలో ఓ మహిళ సహా ముగ్గురు చిన్నారులు మృతి చెందటం స్థానికంగా విషాదం నింపుతోంది. మరో పది నిమిషాల్లో పెళ్లి మంటపానికి ఈ బృందం చేరుకునేది. అంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. రేపు ఉదయం గాజుకుంటపల్లి ఆంజనేయస్వామి దేవాలయం లో వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికొడుకు తల్లి లక్ష్మమ్మ, సమీప బంధువులైన చిన్నారులు నాగేశ్వరి(12) మంజునాథ్(10) కార్తీక్(12)లు మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement