ఆడ బిడ్డ అని.. నీటి తొట్టిలో వేశాడు.. | father murder his baby daughter in sellam | Sakshi
Sakshi News home page

కన్నబిడ్డను కడతేర్చిన తండ్రి

Dec 19 2017 8:51 AM | Updated on Aug 21 2018 6:00 PM

father murder his baby daughter in sellam - Sakshi

సాక్షి, సేలం: పన్నెండు రోజుల పసిబిడ్డను కన్న తండ్రే నీటి తొట్టిలో వేసి కడతేర్చాడు. సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నామక్కల్‌ జిల్లా కుమారపాళయం ప్రాంతంలోని కల్లాంగాట్టు పలసు ఊరికి చెందిన భూపతి (23)కి ధనలక్ష్మి(21)తో గత ఏడాది డిసెంబర్‌ నెలలో వివాహం జరిగింది. ఇద్దరు కూలీ పనులకు వెళుతుంటారు. ధనలక్ష్మి గర్భవతి ఉండడంతో గత నాలుగు నెలలుగా పనికి పోలేదు. 

అదేవిధంగా భూపతి కూడా పనికి వెళ్లకపోవడంతో అతనిని తల్లిదండ్రులు మందలిస్తుండేవారు. ఈనెల 6వ తేదీన ధనలక్ష్మి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత బిడ్డ పాలకు కూడా భూపతి డబ్బులు  ఇవ్వడం లేదని భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ స్థితిలో సోమవారం ఉదయం వేకువజామున 4 గంటలకు బిడ్డ ఏడ్వడంతో ధనలక్ష్మి మేల్కొని పాలు ఇచ్చి తిరిగి పడుకోబెట్టింది. అయితే 5.00 గంటల సమయంలో మేల్కొని చూడగా పక్కన ఉన్న బిడ్డ కనిపించలేదు. 

దీంతో దిగ్భ్రాంతి చెందిన ధనలక్ష్మి భర్త భూపతిని నిద్రలేపి బిడ్డ కనిపించలేదని తెలిపింది. ఇద్దరు పలు ప్రాంతాల్లో వెదికినా కనబడలేదని కుమారపాళయం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తర్వాత పోలీసులు గాలించగా భూపతి ఇంటికి పక్కన కొత్తగా నిర్మిస్తున్న ఇంటి నీటి ట్యాంక్‌లో శిశువు మృతదేహం కనిపించింది. దీంతో ఆ శిశువు మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం సేలం ఆస్పత్రికి తరలించారు. 

పోలీసుల జరిపిన విచారణలో ఇప్పుడు పిల్లలను కనవద్దంటూ భూపతి భార్యతో గొడవపడేవాడని తెలిసింది. అదే సమయంలో ఆడ బిడ్డ పుట్టిందని, పాలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని అందరూ తనను తిడుతున్నారని, ఈ బిడ్డ ఉంటేనేగా ఇన్ని సమస్యలు అని భావించిన భూపతి శిశువును నీటి తొట్టెలో వేసినట్టు తెలిసింది. 12 రోజుల కన్న బిడ్డను నీటి తొట్టిలో వేసి తండ్రి హత్య చేసిన సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement