ముగ్గురు చిన్నారులను బలిగొన్న కసాయి తండ్రి | Father Killed His Three Children In Chittoor | Sakshi
Sakshi News home page

ముగ్గురు చిన్నారులను బలిగొన్న కసాయి తండ్రి

Aug 6 2018 8:34 AM | Updated on Aug 6 2018 9:52 AM

Father Killed His Three Children In Chittoor - Sakshi

నీటిపై తేలియాడుతున్న చిన్నారుల మృతదేహాలు

సాక్షి, చిత్తూరు : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పిల్లలను గుండెలపై ఆడించాల్సిన తండ్రి ఊపిరి తీసేశాడు. భార్యభర్తల మధ్య గొడవలకు అభంశుభం తెలియని చిన్నారులను బలితీసుకున్నాడు. ముక్కు పచ్చలారని ముగ్గురు మగపిల్లలను కర్కశంగా నీటిలో ముంచి చంపాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం బలగంగానపల్లికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చిత్తూరు రూరల్‌ మండలంలోని దిగువపల్లికి చెందిన అమరావతి అనే మహిళతో ఆరేళ్ల క్రితం వివాహమయ్యింది.

వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా డ్రైవర్‌ కావటంతో లారీకి వెళ్లేవాడు. అయితే ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో ముగ్గురు మగపిల్లలను తన సొంత గ్రామానికి తీసుకువెళ్తానంటూ అతడు వారిని వెంటబెట్టుకుని బయలుదేరాడు. మార్గం మధ్యలో గంగాధర నెల్లూరు వద్దగల నీవా నదిలో వారిని పడేసి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement