పెళ్లి రోజునే వధువు అదృశ్యం

Bride Missing On Wedding Day In Karnataka - Sakshi

కర్ణాటక, తుమకూరు : మరి కొద్ది సేపటిలో పెళ్లి జరుగుతుందనగా పెళ్లికుమార్తె మంటపం నుంచి అదృశ్యమైన సంఘటన జిల్లాలోని హులియూరులో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు... హులియూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి, కురిహట్టి గ్రామానికి చెందిన మారుతి అనే యువకుడికి ఆదివారం పెళ్లి జరగాల్సి ఉంది. ఇరువైపుల బంధువులు శనివారం పెళ్లి జరిగే హులియూరులో ఉన్న దుర్గా పరమేశ్వరి సముదాయభవనానికి చేరుకున్నారు.

ఆదివారం పెళ్లికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శనివారం రిసెప్షన్‌లో వధూవరులు ఇద్దరు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం వధువు అల్పాహారం తీసుకుని తన మొబైల్‌ల్లో మాట్లాడుకుంటూ బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. పెళ్లి ముహుర్తం సమీపిస్తుండటంతో పెళ్లి కుమార్తె కనిపించకపోవడంతో మంటపంలో అలజడి నెలకొంది. వధువు కనిపించక పోవడంతో పాటు ఆమె సెల్‌ స్విచాఫ్‌ రావడంతో పెళ్లి కుమార్తె తండ్రి, తల్లి, బంధువులు ఆవేదనతో పెళ్లి మంటపం నుంచి వెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా మంటపం నిశ్శబ్ధ వాతావరణం కనిపించింది.  అదే ముహుర్తానికి మరో యువతితో పెళ్లి కుమారుడికి వివాహం చేయాలని యత్నించినా ఫలించలేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top