ఒకే బైక్‌.. 71 కేసులు ! | 71 Challans on Scooty in Karnataka | Sakshi
Sakshi News home page

ఒకే బైక్‌.. 71 కేసులు !

Dec 15 2019 8:07 AM | Updated on Dec 15 2019 8:07 AM

71 Challans on Scooty in Karnataka - Sakshi

జరిమానా బిల్లులు చూపిస్తున్న పోలీసులు

యశవంతపుర: ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన బైక్‌ చోదకుడిపై 70 కేసులు నమోదు కాగా జరిమానా రూ. 15 వేలు విధించిన సంఘటన బెంగళూరులో జరిగింది. గురువారం రాజాజీనగర ట్రాఫిక్‌ పోలీసులు మహలక్ష్మీ లేఔట్‌ శంకరనగర బస్టాండ్‌ వద్ద హెల్మెట్‌ లేకుండా వెళ్తున్న బైక్‌ చోదకుడు మంజును పోలీసులు ఆపారు. బైక్‌ నంబర్‌ కేఏ 41–ఇజి6244 ఆధారంగా అతడికి హెల్మెట్‌ లేని కారణంగా జరిమానా విధించాలని పోలీసులు పరిశీలించారు. జరిమానా రశీదు ఏకంగా రెండు మీటర్ల పొడవుతో జరిమానా బిల్లు వచ్చింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ఏడాదిగా అతడిపై 70 కేసులు నమోదైనట్లు పెద్ద స్లిప్‌ వచ్చింది. తాజా కేసులో మొత్తం 71 కేసులు అతడిపై నమోదయ్యాయి. హెల్మెట్‌ లేకుండా, త్రిబుల్‌ రైడింగ్, సిగ్నల్‌ జంపింగ్‌ కేసులు ఉన్నాయి.

కెమెరాలు పట్టేస్తాయి : బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసిన కెమెరాలు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎప్పటికైనా దొరకడం ఖాయమని చెబుతున్నాయి. ఏడాదిగా తప్పించుకు తిరుగుతున్న ఓ బైక్‌ చోదకుడి తాజాగా దొరకడమే ఇందుకు నిదర్శనం. పోలీసులు లేరని సిగ్నల్‌ జంప్‌ చేసినా కెమెరాలో దొరికిపోతారు. ఈ కెమెరాలో ఫొటోలు తీసి కంట్రోల్‌ రూమ్‌కు పంపుతాయి. దీంతో పోలీసులు కేసులు నమోదు చేయవచ్చని స్పష్టం చేస్తోంది. వాహనదారులు ట్రాఫిక్‌ నియమాలు ఉల్లఘించకుండా వాహనాలను జాగ్రత్తగా నడపాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement