తిరుపతిలో ఎర్రచందనం పట్టివేత

సాక్షి, తిరుపతి: తిరుపతి నగరంలోని హరిత కాలనీలో మంగళవారం పోలీసులు దాడిచేసి ఎర్రచందనం దుంగలను స్వాదీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఓ వాహనంలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా వెళ్ళి పట్టుకున్నారు.

పోలీసులను చూసిన స్మగ్లర్లు ఎర్రచందనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ సందర్బంగా 12 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన స్మగ్లర్ల కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top