ఉత్సాహంగా స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ఉత్సాహంగా ప్రారంభమైనాయి. ఆరంభ లాభాల నుంచి మరింత ఎగిసి సెన్సెక్స్ లాభాల సెంచరీ కొట్టేసింది. ప్రస్తుతం 128 పాయింట్లు ఎగిసి 38,501 వద్ద, నిఫ్టీ 40పాయింట్లు లాభపడి11560 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని సెక్టార్లులాభాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ బాగా లాభపడుతోంది. అటు జెట్ ఎయిర్వేస్ సహా ఎయిర్లైన్స్ షేర్లన్నీ లాభాల నార్జిస్తున్నాయి. మరోవైపు లాభాలతో జోరుగా ఉన్న నిఫ్టీ బ్యాంకు 30వేల వద్ద ఆల్ టైం ని టచ్ చేసింది.
ఎన్టీపీసీ, ఇండియా బుల్స్హౌసింగ్, బజాజ్ ఫిన్, భారతి ఎయిర్టెల్, ఎస్బ్యాంకు లాభపడుతున్నాయి. మరోవైపు కోల్ ఇండియా, టీసీఎస్, అదానీ పోర్ట్స్, హెచ్యూఎల్, మారుతి సుజుకి నష్టపోతున్నవాటిల్లో ఉన్నాయి.
మరిన్ని వార్తలు