ఫ్లాట్‌గా మార్కెట్లు : టీసీఎస్‌ జోరు | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా మార్కెట్లు : టీసీఎస్‌ జోరు

Published Mon, Apr 15 2019 9:22 AM

Stockmarkest opens with small gains - Sakshi

సాక్షి, ముంబై : స్టాక్‌మార్కెట్లు   స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అనంతరం లాభాలుమరింత పుంజుకున్నాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో సెన్సెక్స్‌ పాయింట్ల 93 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 29 పాయింట్లు లాభంతో ట్రేడ్‌ అవుతోంది.  తద్వారా నిఫ్టీ 11650ని అధిగమించింది. 

ఫలితాల ప్రభావంతో టీసీఎస్‌ భారీగా​ లాభపడుతూ టాప్‌ విన్నర్‌గా ఉంది. ఇంకా కోల్‌ ఇండియా, టాటా మోటార్స్‌, ఐవోసీ, టాటాస్టీల్‌, హిందాల్కో, ఐటీసీ, జీఎంఆర్‌ లాభపడు తున్నాయి. మరోవైపు మార్జిన్లు నిరాశపర్చడంతో ఇన్వెస్టర్ల అమ్మకాల హోరుతో ఇన్ఫీ భారీగా నష్ట పోతోంది. వీటితోపాటు గెయిల్‌, జీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ నష్టపోతున్నాయి. 

మరోవైపు రిలయన్స్‌,  హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో,మైండ్‌ట్రీ లాంటి కార్పొరేట్‌ కంపెనీల క్యూ4 ఫలితాలు ఈ వారం మార్కెట్‌ గతిని ప్రభావితం చేయనున్నాయి. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement