
జీఎన్ఏ యాక్సిల్స్ లిస్టింగ్ లాభాలు
వాహన విడిభాగాలు తయారు చేసే జీఎన్ఏ యాక్సి ల్స్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్లో మెరుపులు మెరిపించింది.
ముగింపులో 18 శాతం లాభాలు
న్యూఢిల్లీ: వాహన విడిభాగాలు తయారు చేసే జీఎన్ఏ యాక్సి ల్స్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్లో మెరుపులు మెరిపించింది. ఇష్యూ ధర(రూ.207) తో పోల్చితే బీఎస్ఈలో 20 శాతం, ఎన్ఎస్ఈలో 22 శాతం లాభాలతో లిస్ట్ అయింది. చివరకు బీఎస్ఈలో 18.45 శాతం లాభంతో రూ.245 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్లో ఈ షేర్ 26 శాతం లాభంతో రూ.260 గరిష్ట స్థాయిని తాకింది. బీఎస్ఈలో 5.9 లక్షలు, ఎన్ఎస్ఈలో 15.2 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. సోమవారం నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.526 కోట్లుగా ఉంది.
ఈ నెల 14-16 మధ్య ఈ కంపెనీ రూ.130 కోట్ల సమీకరణ కోసం ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వచ్చింది. రూ.205-207 ధరల శ్రేణిగా ఉన్న ఈ ఐపీఓ 55 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్(క్విబ్)కు కేటాయించిన వాటా 17 రెట్లు, సంస్థాగేతర ఇన్వెస్టర్ల వాటా 217 రెట్లు చొప్పున ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యాయి. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను -యంత్రాలు, ప్లాంట్ను కొనుగోలు చేయాలని, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను, ఇతర సాధారణ వ్యాపార అవసరాలను తీర్చుకోవడానికి వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది.