ఎయిర్‌ఏషియా ఇండియా 20 శాతం డిస్కౌంట్‌ | AirAsia India 20% discount | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ఏషియా ఇండియా 20 శాతం డిస్కౌంట్‌

Feb 16 2019 12:38 AM | Updated on Feb 16 2019 5:29 AM

AirAsia India 20% discount - Sakshi

ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ, ఎయిరేషియా ఇండియా విమాన టికెట్లపై 20 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. తమ విమాన సర్వీసులపైనా, ఎయిర్‌ఏషియా నెట్‌వర్క్‌ విమాన సర్వీసుల్లోనూ ఈ ఆఫర్లు వర్తిస్తాయని ఎయిరేషియా ఇండియా తెలిపింది. ఈ ఆఫర్లకు సంబంధించిన బుకింగ్స్‌ నెల 18 నుంచి ప్రారంభమవుతాయని, ఈ నెల 25 వరకూ అందుబాటులో ఉంటాయని కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సునీల్‌ భాస్కరన్‌ తెలిపారు.

ఈ డిస్కౌంట్‌ టికెట్లతో ఈ నెల 25 నుంచి జూలై 31 వరకూ ప్రయాణించవచ్చని వివరించారు. ఎయిర్‌ఏషియా అంతర్జాతీయ రూట్లలో కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొన్నారు. మన దేశానికి చెందిన టాటా గ్రూప్, మలేషియాకు చెందిన ఎయిరేషియా కలసి ఎయిర్‌ఏషియా ఇండియా జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీ 19 దేశీయ రూట్లలో, 20 ఎయిర్‌బస్‌ ఏ320లతో విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. కాగా,వెబ్‌సైట్‌ ద్వారాగానీ లేక యాప్‌ద్వారాకానీ టికెట్లను బుక్‌ చేసుకోవని ఎయిర్‌ఏషియా ఒక ప్రకటలో తెలిపింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement