నేడు మొగల్తూరుకు వైఎస్ జగన్ | ys jaganmohan reddy to visit mogalturu | Sakshi
Sakshi News home page

నేడు మొగల్తూరుకు వైఎస్ జగన్

Mar 30 2017 2:05 PM | Updated on Apr 4 2018 9:25 PM

నేడు మొగల్తూరుకు వైఎస్ జగన్ - Sakshi

నేడు మొగల్తూరుకు వైఎస్ జగన్

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా ఫ్యాక్టరీలో ఐదుగురు కార్మికులు మరణించిన ఘటనపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం నల్లావారి చెరువులోని ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువులు వెలువడి ఐదుగురు కార్మికులు మరణించిన ఘటనపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ఆయన మొగల్తూరుకు వెళ్లి, మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.

ఈ రోజు ఉదయం నల్లావారి చెరువులోని ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువులు వెలువడటంతో ఐదుగురు కార్మికులు మరణించారు. రసాయనిక ట్యాంకులను శుభ్రం చేస్తుండగా విషవాయువులు లీక్ అయినట్టు తెలుస్తోంది. మొగల్తూరు పర్యటన కారణంగా వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ పర్యటనను రద్దు చేసుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement