‘విశ్రాంత భృతి’ ప్రారంభించనున్న సీఎం జగన్‌ | YS Jagan Starts Finance Assistance Under Aarogyasri On Dec 2nd | Sakshi
Sakshi News home page

‘విశ్రాంత భృతి’ ప్రారంభించనున్న సీఎం జగన్‌

Dec 1 2019 8:04 PM | Updated on Dec 1 2019 8:29 PM

YS Jagan Starts Finance Assistance Under Aarogyasri On Dec 2nd - Sakshi

సాక్షి, గుంటూరు : డాక్టర్‌ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్స చేయించుకున్నవారికి విశ్రాంత భృతి అందించే పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం గుంటూరులో ప్రారంభించనున్నారు. ఇందుకోసం సోమవారం ఉదయం 10.30 గంటలకి తాడేపల్లి నివాసం నుంచి సీఎం వైఎస్ జగన్‌ గుంటూరు బయలుదేరనున్నారు. 11.20 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి చేరుకుని అక్కడ విశ్రాంత భృతి పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం గుంటూరు మెడికల్ కాలేజ్‌ జింఖానా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అనంతరం  సీఎం వైఎస్‌ జగన్‌ తిరిగి తాడేపల్లికి వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement