నవంబర్‌ 2 నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర | YS Jagan Mohan Reddy padayatra will start | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 2 నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర

Oct 11 2017 3:13 AM | Updated on Jul 25 2018 4:50 PM

YS Jagan Mohan Reddy padayatra will start - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం
ఏపీలో నవంబర్‌ 2వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం వరకూ దాదాపు 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తానని చెప్పారు. ఆరు నెలల పాటు సాగే ఈ యాత్రలో ఎక్కడికక్కడ జనంతో మమేకమవుతూ.. రాష్ట్రంలో సాగుతున్న ప్రజావ్యతిరేక పాలన గురించి అందరికీ వివరిస్తానన్నారు. మంగళవారం అనంతపురంలో నిర్వహించిన ‘యువభేరి’లో జగన్‌ మాట్లాడుతూ పాదయాత్ర గురించి ప్రస్తావించారు.

‘నవంబర్‌ 2 నుంచి నేను పాదయాత్ర ప్రారంభిస్తున్నా.. యువభేరిలో పాల్గొనకపోవచ్చు. ఇప్పటికే 10 జిల్లాల్లో ఆ కార్యక్రమం నిర్వహించాం. ఇకపై ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు ఆ బాధ్యత అప్పగిస్తున్నా. వారు వారి పరిధిలోని ప్రతీ కాలేజీకి వెళ్లి యువభేరి నిర్వహిస్తారు. పాదయాత్రలో కూడా ప్రత్యేక హోదా గురించి వివరించి ప్రజల మద్దతు కూడగడతా. జగన్‌ ఒక్కడే ఏమీ చేయలేడు. మీ అందరి తోడ్పాటు ఉంటే ఏదైనా సాధ్యమే’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement