షార్ శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు | ys jagan mohan reddy congrats to SHAR scientists | Sakshi
Sakshi News home page

షార్ శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు

Jun 30 2014 11:59 AM | Updated on Jul 25 2018 4:09 PM

షార్ శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు - Sakshi

షార్ శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం షార్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

హైదరాబాద్ : షార్ శాస్త్రవేత్తలకు అభినందనల పరంపర కొనసాగుతోంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం షార్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. పీఎస్ఎల్వీ సీ- 23 ప్రయోగం విజయవంతం కావటంపై ఆయన అభినందించారు. అంతరిక్ష ప్రయోగ రంగంలో అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా భారత్ ఎదుగుతోందని వైఎస్ జగన్ అన్నారు. భారత్ కీర్తి కిరీటంలో పీఎస్ఎల్వీ సి-23 ప్రయోగం మరో మైలురాయిగా ఆయన అభివర్ణించారు.

కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా శాస్త్రవేత్తలను అభినందనలు తెలిపారు. అంతకు ముందు ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాకెట్ వివిధ దశలను దాటుతూ కక్ష్యలోని విజయవంతంగా ప్రవేశించగానే శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement