వైఎస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో చవితి వేడుకలు | Vinayaka Chavithi Pooja at YSRCP office in kakinada | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో చవితి వేడుకలు

Aug 25 2017 1:43 PM | Updated on Aug 9 2018 2:42 PM

కాకినాడ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.

సాక్షి, కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పూజలు నిర్వహించారు.

ఈ పూజా కార్యక్రమంలో పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, చలమలశెట్టి సునీల్‌, గుడివాడ అమర్నాథ్‌, వేణుగోపాల్‌ కృష్ణ, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, కోన రఘుపతి, వంతల రాజేశ్వరితో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ: హైదరాబాద్‌లోని వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ వినాయక చవితి వేడుకలు జరిగాయి. వేద పండితుని మంత్రోచ్ఛరణ నడుమ బొజ్జ గణపయ్యకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి,  తెలంగాణ వైఎస్‌ఆర్‌ సీపీ నేత కొండా రాఘవరెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు... దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని నేతలు కాంక్షించారు.










Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement