
తుప్పుపడుతున్న వాహనాలు
సారూ... మాకెన్నాళ్లీ సంకెళ్లు. మా యందు దయ ఉంచి తమను రోడ్డుపైకి విడిచిపెట్టండి. రహదారులపై జామ్ అంటూ దూసుకుపోతాం..
ఏళ్ల తరబడి పోలీస్ స్టేషన్లో పేరుకుపోయిన వైనం
చెరుకుపల్లి : సారూ... మాకెన్నాళ్లీ సంకెళ్లు. మా యందు దయ ఉంచి తమను రోడ్డుపైకి విడిచిపెట్టండి. రహదారులపై జామ్ అంటూ దూసుకుపోతాం.. అని వేడుకుంటున్నాయి ద్విచక్రవాహనాలు. చోరీకి గురైన వాహనాలు, రోడ్డు ప్రమాదాలకు గురైన వాహనాలను పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి, ఓ మూన పడేశారు. ఇవి ఏళ్ల తరబడి ఎండుకు ఎండుతూ.. వర్షానికి తడుస్తూ తుప్పుపట్టి పాడైపోతున్నాయి. ఈ వాహనాలు తమవేనని ఎవరూ రావడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు.
పోనీ పాడైపోతున్న వాహనాలకు వేలం పాట నిర్వహించడంలోనూ పోలీసులు చిత్తశుద్ధి కనపర్చడం లేదు. స్టేషన్ ఆవరణలో ఆ వాహనాలు తుప్పుపట్టి శిధిలమవుతున్నా అధికారులు పట్టీపట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.