అక్కడి టీచర్లకు బదిలీలు ఉండవు
విద్యాశాఖ ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలు
2013 బదిలీ ఉత్తర్వులు అమలు చేయని వైనం
బదిలీ కోసం 434 మంది ఎదురు చూపు
తాజా బదిలీలకు అడ్డంకి..
అధికారుల తీరుపై ఉపాధ్యాయుల ఆగ్రహం
చిత్తూరు : ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పం ఉపాధ్యాయులకు శాపంగా మారింది. కుప్పం నుంచి బదిలీపై వెళ్లేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ససేమిరా అంటుండడంతో బదిలీలు లేక వందలాది మంది ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. 2013 ఏడాదిలో బదిలీ ఉత్తర్వులు అందుకున్నా రిలీవర్స్ రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా 434 మంది ఉపాధ్యాయుల బదిలీలు నిలిచి పోయాయి. అయితే తాజా బదిలీలకు ఇది అడ్డంకిగా మారింది. 2013 బదిలీలను అమలు చేసిన తరువాతనే కొత్త బదిలీలు చేయాల్సి ఉంది. 2013లో జిలా వ్యాప్తంగా 434 మంది ఉపాధ్యాయులను బదిలీ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో సెకెండరీ గ్రేడ్ వారితో పాటు స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. ఒక్క కుప్పం నియోజకవర్గం నుంచే 204 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. బదిలీ ఉత్తర్వులు అందుకున్నా సబ్స్ట్యూట్లు రాకపోవడంతో బదిలీ అయిన ఉపాధ్యాయులు రిలీవ్ కాలేదు.
కుప్పంలో ఉన్న ఉపాధ్యాయులు బదిలీపై వెళితే తిరిగి వారి స్థానాలకు ఉపాధ్యాయులు వె ళ్లే పరిస్థితి లేదని తెలుసుకున్న ఉన్నతాధికారులు వారికి రిలీవ్ అయ్యే అవకాశం లేకుండా చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బదిలీల తంతు సాగినా కుప్పంతో పాటు చిత్తూరు జిల్లాలో అప్పట్లో బదిలీలను నిలిపివేశారు. మూడేళ్లు గడుస్తున్నా వారు రిలీవ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. కుప్పం అటు కర్నాటక, ఇటు తమిళనాడు సరిహద్దులోనూ... చిత్తూరు, తిరుపతికి దూరంగా ఉంది. దీంతో వివిధ శాఖల ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులకు సైతం తిప్పలు తప్పడంలేదు. వసతుల లేమితో పాటు పిల్లల చదువుల ఇబ్బందుల దృష్ట్యా కుప్పంలో నివాసం ఉండేందుకు ఉపాధ్యాయులు ముందుకు రావడంలేదు. చాలా మంది తిరుపతి,చిత్తూరులో కాపురం ఉంటున్నారు. కుప్పం ప్రాంతానికి బదిలీపై వెళ్లేందుకు ఉద్యోగులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు ఉన్నతాధికారులు అంగీకరించడంలేదు.
వెళ్లిన ఉద్యోగులు గడువు అనంతరం తిరిగి బదిలీ చేయించుకుని వచ్చేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. అధికారిక ఉత్తర్వులు లేకపోయినా అనధికార ఉత్తర్వులతో ఉపాధ్యాయులతోపాటు వివిధ శాఖల ఉద్యోగులను సైతం భయపెడుతున్నారు. ఒక్క కుప్పంలోనే 204 మంది ఉపాధ్యాయుల బదిలీలు ఆగాయి. కుప్పం నియోజకవర్గం అన్ని శాఖల అధికారులకు శాపంగా మారిందని ఉపాధ్యాయులతోపాటు వివిధ శాఖల అధికారులు వాపోతున్నారు. తాజాగా ముందు మా సంగతి తేల్చమంటూ 434 మంది ఉపాధ్యాయులు అధికారులను నిలదీస్తున్నారు.
కుప్పం.. శాపం.!
Published Mon, Sep 14 2015 2:03 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రియుడిని పరిచయం చేసిన ఫైమా.. ఇదేంటి రాధికా అంటూ కామెంట్లు
థాయ్లాండ్ ఓపెన్ విజేతగా సాత్విక్-చిరాగ్ జోడీ
ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్లరీనే!
ఓటీటీకి రూ.150 కోట్ల చిత్రం.. ఈ సారైనా?
ఇండోనేషియాలో స్టార్లింక్ సర్వీస్.. 'మస్క్' నెక్స్ట్ ప్లాన్ అదేనా!
మగవాళ్లకు స్టయిలింగ్ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ
ప్రముఖ నటికి సర్జరీ.. షాకయ్యానన్న మాజీ భర్త!
నేను గెలిస్తే సినిమాలు మానేస్తా.. కంగనా సంచలన నిర్ణయం
భారత్ ఫార్మా కంపెనీలకు అమెరికా కీలక ఆదేశాలు
T20 WC 2024 Trophy At Sakshi: సెమీస్ చేరే జట్లు ఇవే: పీయూశ్ చావ్లా
తప్పక చదవండి
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement