ఈనాటి ముఖ్యాంశాలు
రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్లో దారుణం చోటుచేసుకుంది. తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఇసుక అన్నది తాత్కాలిక సమస్య మాత్రమేనని, వరదలు తగ్గగానే ఇసుక సరఫరా పెరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బయోడైవర్సిటీ డబుల్ హైట్ ఫ్లైఓవర్ను సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీ తీవ్ర కాలుష్యం కోరల్లో చిక్కుకున్న నేపథ్యంలో కేంద్రం, ఆమాద్మీ పార్టీ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.