నాపై మీరు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు: వైఎస్‌ జగన్‌

Thankful to each one of you tweets YS Jaganmohan Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 'గత ఏడాదిగా నాకు అండగా ఉంటూ నాపై మీరు చూపించిన ప్రేమకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు కొత్త ఏడాదిలో ఆ దేవుడు ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని ట్విటర్‌లో వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top