ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు.
హిందూపురం రూరల్: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా హిందూపురం మండలం మలుగూరు క్రాస్రోడ్డు వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పెనుకొండ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేసే తిమ్మయ్య (37) శనివారం సాయంత్రం బైక్పై హిందపూరం వెళుతుండగా ధర్మవరం డిపోకు చెందిన బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తిమ్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.