ఏలూరు (ఫైర్స్టేషన్ సెంటర్) : ఏడాదికాలంగా జీతాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏలూరు కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని ట్రామాకేర్ ఉద్యోగులు 15 రోజులుగా రోడ్డెక్కారు. అయినా పాలకులు పట్టించుకోకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ముందుగా ఆసుపత్రి సూపరింటెండెంట్కు నోటీసు జారీ చేశారు. అయినా స్పందన లభించక పోవడంతో గత 15 రోజుల క్రితం విధులను బహిష్కరించి ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్దే టెంటు ఏర్పాటు చేసుకుని మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెకు దిగారు.
అత్యవసర సేవలకు విఘాతం
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిలో ఎక్కువ మందికి సకాలంలో వైద్యం అందకపోవడంతో మృత్యువాత పడతారు. సకాలంలో వైద్యం అందిస్తే ఎంతో మంది జీవించే అవకాశం ఉంది. ఈ పరిస్థితి స్వయంగా వైద్యుడైన మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గమనించి రోడ్డు ప్రమాదాలకు గురైన క్షతగాత్రులకు సకాలంలో వైద్య సేవలందించాలనే ధ్యేయంతో జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న ప్రభుత్వాసుపత్రులలో ట్రామాకేర్ ఏర్పాటుకు 2009లో ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాలమేరకు ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో 2010లో ట్రామాకేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు.
దీనిలో మొత్తం 33 మంది సిబ్బందిని నియమించారు. ఈ సిబ్బందికి ఇచ్చే వేతనాలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశ్యంతో దివంగత నే త అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల నుంచి వేతనాలను మంజూరు చేయించారు. వైఎస్ మరణించినా ఈ నిధులు ఉన్నంత వరకు సిబ్బందికి వేతనాలు సక్రమంగానే అందాయి. 2013 జూలై నెల నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అయిపోవడంతో సిబ్బంది వేతనాలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఈ నెల వరకు జీతాలు విడుదల కాకపోవడంతో ఈ చిరు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించి ఆడిట్ జరగని కారణంగానే వేతనాలు నిలిచిపోయాయని వైద్య, విధాన పరిషత్ అధికారులు చెబుతున్నారు. కాని ఆడిట్ను జరిపించే పక్రియను మాత్రం చేపట్టడం లేదు.
నెరవేరని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల హామీలు
ట్రామాకేర్ సెంటర్ ఉద్యోగులు సమ్మె ప్రారంభించినప్పటి నుండి ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే ఆడిట్ జరిపించి వేతనాలు ఇప్పిస్తామని హామీలు గుప్పిస్తున్నారు తప్ప పట్టించుకున్న వారు లేరు. 10 రోజుల క్రితం ఆసుపత్రి సూపరింటెండెండ్ కార్యాలయాన్ని ఉద్యోగులు ముట్టడించడంతో ఈ సమస్య పరిష్కానికి ఉన్నతాధికారులతో మాట్లాడతానని సూపరింటెండెండ్ ఈశ్వర ప్రసాద్ హామీ ఇచ్చారు. గత సోమవారం సమ్మె శిబిరం నుంచి ఫైర్స్టేషన్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కాటమనేని భాస్కర్కు వినతి పత్రం అందించారు.ఆయన సమస్య పరిష్కారంపై నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్వో కె.శంకరరావును ఆదేశించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, దెందులూరు ఎమ్మెల్యే, చివరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్కు తమ సమస్యను మొరపెట్టుకున్నారు. హామీలు ఇచ్చారు తప్ప తమకు న్యాయం చేయలేదని ట్రామాకేర్ ఉద్యోగులు ఎం.కిషోర్, రమేష్, రాజేష్, సునీత, కవిత, విజయకుమారి, అనురాధ, దయామణి, స్వప్న, సుధారాణి, శాంతకుమారి, ఉష విజ్ఞప్తి చేస్తున్నారు.
టామాకేర్ .. క్యార్ క్యార్
Published Tue, Jul 29 2014 1:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement