కలిగిరి: ఆటోల దూకుడు ప్రయాణికులకే కాదు.. పాఠశాల విద్యార్థులకూ ప్రమాదాలు తప్పడం లేదు. విద్యార్థులను జాగ్రత్తగా తీసుకు రావాల్సిన ఆటో డ్రైవర్లు ఇవేమి పట్టించుకోకుండా ఇష్టానుసారం మితిమీరిన వేగంతో నడుపుతుండటంతో విద్యార్థులు ప్రమాదాల భారిన పడుతున్నారు. మితిమీరిన వేగంతో వెళ్తున్న ఆటో తిరగబడి విద్యార్థులు గాయపడిన సంఘటన గురువారం కలిగిరిలో చోటుచేసుకుంది.
కలిగిరి సమీపంలోని కమ్మవారిపాళెంలో మోడల్ స్కూల్ నుంచి విద్యార్థులను ఇళ్లకు తీసుకువెళుతున్న ఆటో బోల్తాపడింది. ఈ సంఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మోడల్ స్కూల్ నుంచి 8 మంది విద్యార్థులు ఆటోలో వస్తున్నారు. ఆటో డ్రైవర్ ఫిరోజ్ మీతిమీరిన వేగంతో నడుపుతుండటంతో కేజీబీవీ పాఠశాల వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కలిగిరికి చెందిన 6వ తరగతి విద్యార్థి పెద్ది వంశీ, 9వ తరగతి విద్యార్థి శెట్టి రుచితకు తీవ్ర గాయాలవ్వగా, 8వ తరగతి చదువుతున్న రాజనాల ప్రత్యూష, ఆవుల మానస, ఆవుల పూర్ణిమ గాలయాలపాలయ్యారు.
స్థానికులు గాయపడిన విద్యార్థులను మరో ఆటోలో కలిగిరిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆర్టీసీ బస్సులు పాఠశాల వద్ద ఆపకపోతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆటోలను నెల అద్దెకు మాట్లాడుకుని విద్యార్థులను పంపుతుంటారు. ప్రమాదం అని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోల్లో పంపాల్సి వస్తుందని, అధికారులు స్పందించి పాఠశాల వద్ద బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైందని తెలుసుకున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో ప్రజలు వైద్యశాల వద్దకు చేరుకున్నారు. మెదక్ జిల్లా మాసాయిపేటలో రైలు ఢీకొన్న సంఘటనను టీ వీల్లో చూస్తున్న ప్రజలు ఈ ప్రమాదం విషయం తెలుసుకుని ఆందోళనకు గురయ్యారు. గాయపడిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఓదార్చారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై దాసరి రాజారావు సంఘటన స్థలానికి చేరుకొని ఆటోను స్వాధీనం చేసుకొని పోలిస్స్టేషన్కు తరలించారు. అనంతరం వైద్యశాలకు వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
విద్యార్థుల ఆటో బోల్తా
Published Fri, Jul 25 2014 3:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement