విజయవాడ-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు | Special trains to be run between Vijayawada to Secunderabad | Sakshi
Sakshi News home page

విజయవాడ-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు

Jan 21 2015 6:28 AM | Updated on Apr 7 2019 3:28 PM

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు  తెలిపారు. ఈ మేరకు విజయవాడ-సికింద్రాబాద్ (07207) ప్రత్యేక రైలు ఈ నెల 29న రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-విజయవాడ (07208) స్పెషల్ ట్రైన్ ఈ నెల 30న రాత్రి 11.15 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45కు విజయవాడ చేరుకుంటుంది.
 
 గువాహటి-త్రివేండ్రం (02516) ప్రత్యేక రైలు ఈ నెల 26న (సోమవారం) రాత్రి 11.25కి గువాహటి (అస్సాం) నుంచి బయలుదేరి గురువారం రాత్రి 10.30కి త్రివేండ్రం (కేరళ) చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో త్రివేండ్రం- గువాహటి (02515) ప్రత్యేక రైలు ఈనెల 30న మధ్యాహ్నం 12కి త్రివేండ్రం నుంచి బయలుదేరి వచ్చే నెల ఒకటిన ఉదయం 8.20కి గువాహటి చేరుతుంది. ఇది ఏపీలో వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, గూడూరు స్టేషన్లలో ఆగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement