శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కల్పించాలని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కోరారు. ఇదే డిమాండ్తో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకూ రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. శ్రీకాకుళంలోని ఇందిరావిజ్ఞాన భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ విభజన చట్టంలో తీర్మాణం చేసినట్టు పేర్కొన్నారు. ఇందుకు అప్పటి ప్రతిపక్ష పార్టీ నేత వెంకయ్యనాయుడు అంగీకరించారన్నారు. ఇపుడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.
ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నేతృత్వంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అలాగే ప్రధాని మోడీని, ఇతర పార్టీల ప్రతినిధులను కలసి ప్రత్యేకహోదా కోసం మద్దతివ్వాలని మాట్లాడడం జరిగిందన్నారు. కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రోజుకు రెండు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రియాశీల సభ్యులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యతతో సత్వర అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ కాంక్షిస్తుందన్నారు.
రాజకీయాలకు అతీతంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ ఏపీ విభజన సమయంలో అన్ని పార్టీలూ ఏవిధంగా అయితే సహాయ పడ్డాయో ఇపుడు ప్రత్యేక హోదా కల్పన కోసం అలాగే కృషిచేయాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు డోల జగన్మోహనరావు మాట్లాడుతూ సోమవారం నుంచి రిలేనిరాహారదీక్షలు చేపడతామన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కిల్లి రామ్మోహన్రావు, చౌదరి సతీష్, రత్నాల నరసింహమూర్తి, పైడి రవి, గంజి ఎజ్రా, ఎం.ఎ.బేగ్, చొంగ రమాదేవి, పుట్టా అంజనీకుమార్, లండ శ్రీను పాల్గొన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి
Published Sun, Mar 15 2015 3:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తనిఖీల్లో రూ.1.6 లక్షల పట్టివేత
మళ్లీ మోదీనే ప్రధాని
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్
గల్లంతైన మృతదేహాలు లభ్యం
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
అర్ధరాత్రి ఇళ్లలో చోరీ
బతికున్న రైతును చంపేసి..
పోలింగ్ కేంద్రాల్లో సకల సౌకర్యాలు
మండుటెండలో ‘ఆసరా’ వెతలు
నిజాయతీ చాటుకున్న ఉపాధ్యాయుడు
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement