కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్ | special commission for Kapu community, says yanamala | Sakshi
Sakshi News home page

కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్

Aug 20 2014 12:27 PM | Updated on Sep 2 2017 12:10 PM

కాపులను బీసీల్లోకి చేర్చే అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్‌ ఏర్పాటు చేసింది.

హైదరాబాద్ :  కాపులను బీసీల్లోకి చేర్చే అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రస్తావించారు.

 

కాగా పార్టీ అధికారంలోకి వస్తే కాపులకు ప్రాధాన్యతతో పాటు కాపులను బీసీల్లో చేరుస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాపుల్లో పేదవర్గాల అభివృద్ధికి వెయ్యు కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తానని అప్పట్లో బాబు హామీ ఇచ్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement