కరువు పరిస్థితులపై వాయిదా తీర్మానం | speaker kodela siva prasad rejects adjournment motion | Sakshi
Sakshi News home page

కరువు పరిస్థితులపై వాయిదా తీర్మానం

Aug 26 2014 9:47 AM | Updated on Jul 29 2019 2:44 PM

రాష్ట్రంలో రుతు పవనాల వైఫల్యం.. కరవు పరిస్థితులు, తాగు నీటి సమస్యపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం వాయిదా తీర్మానం ఇచ్చింది.

హైదరాబాద్ : రాష్ట్రంలో రుతు పవనాల వైఫల్యం.. కరవు పరిస్థితులు, తాగు నీటి సమస్యపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై ప్రభుత్వ ప్రకటన కోరింది. అయితే వైఎస్ఆర్ సీపీ తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్.. ముఖ్యమైన ఈ అంశాన్ని మరో రూపంలో ప్రస్తావించాలని.. అప్పడు సభలో చర్చించవచ్చని సూచించారు.

 

దీంతో చర్చకు పట్టు బట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. నివారించిన స్పీకర్.. సభా కార్యక్రమాలు జరగనివ్వాలని కోరారు. కాసేపటి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు వెనక్కి తగ్గడంతో ప్రశ్నోత్తరాలు మొదలయ్యాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement