కృష్ణా, గుంటూరు అధికారులతో సింగపూర్ బృందం భేటీ | Singapore team meets krishna, guntur district officers over ap capital | Sakshi
Sakshi News home page

కృష్ణా, గుంటూరు అధికారులతో సింగపూర్ బృందం భేటీ

Dec 11 2014 10:27 AM | Updated on May 29 2019 3:19 PM

కృష్ణా, గుంటూరు జిల్లా రెవిన్యూ, పట్టణాభివృద్ధి అధికారులతో సింగపూర్ ప్రతినిధుల బృందం గురువారం భేటీ అయ్యింది.

హైదరాబాద్ : కృష్ణా, గుంటూరు జిల్లా రెవిన్యూ, పట్టణాభివృద్ధి అధికారులతో సింగపూర్ ప్రతినిధుల బృందం గురువారం భేటీ అయ్యింది. ఆపీ సచివాలయంలో మంత్రి నారాయణ నేతృత్వంలో రాజధాని ప్రాంతంలో భూముల వివరాలు, రాజధాని నిర్మాణం,  భౌగోళిక పరిస్థితులపై సమీక్ష జరుపుతోంది. ఈ భేటీలో ఇరు జిల్లాల కలెక్టర్లతో పాటు, రాజధాని పరిధిలోని ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

కాగా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అనువైన భూమిని పరిశీలించడానికి సింగపూర్ నుండి వచ్చిన బృందం... విజయవాడ - గుంటూరు జిల్లాలలో  ఏరియల్ పర్యటన చేసింది. మరోవైపు  సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో పాటు, మరో 15మంది సభ్యుల బృందం, ఏపీ ప్రభుత్వంతో మంగళవారం ప్రాథమిక చర్చలు జరిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement