‘రుణం కోసం ఆరు నెలల నుంచి కాళ్లరిగేలా తిరుగుతున్నాం. రేపు రండి.. మాపు రండి అంటూ తిప్పుకుంటూనే ఉన్నారు. ఎన్ని నెలలు తిరగాలి సార్. ఇక మా వల్ల కాదు. రుణం ఇవ్వకుండా ఇలా తిప్పుకోవడం న్యాయమా.. మా పనులన్నీ వదులుకుని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా కనీస కనికరం కూడా లేదు. ఎంత అన్యాయం సార్..’ అంటూ మహిళలు మూకుమ్మడిగా బ్యాంకుపై దండెత్తారు.
ప్రొద్దుటూరు, న్యూస్లైన్: ప్రొద్దుటూరు పట్టణం సూపర్బజార్రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (వ్యవసాయ అభివృద్ధి శాఖ) అధికారుల నిర్లక్ష్య వైఖరిలపై బుధవారం ఉదయం మహిళలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గడువు ముగిసినా బ్యాంక్ అధికారులు రుణాలు మంజూరు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకెళితే.. మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన ఇందిరాక్రాంతి పథం మహిళలకు ఈ బ్యాంక్లో రుణాలు మంజూరు చేస్తున్నారు. సుమారు 1200 స్వయం సహాయక సంఘాలు బ్యాంక్ పరిధిలో ఉన్నాయి. కాగా ఇటీవల కాలంలో రుణాల మంజూరుకు సంబంధించి బ్యాంక్ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు.
గత ఆరు నెలలుగా పరిస్థితి ఇలాగే ఉంది. దాదాపు 150 సంఘాలకు సంబంధించి డాక్యుమెంటేషన్ పూర్తయినా వారికి ఇంత వరకు రుణాలు మంజూరు చేయలేదు. మరో 200 సంఘాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్లు సంబంధిత అధికారుల వద్ద ఉన్నాయి. నిబంధనల ప్రకారం పాత రుణాలు చెల్లించిన వెంటనే వీరికి కొత్తగా రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. ప్రస్తుతం సుమారు రూ.4కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజి కింద రుణాలు మంజూరు చేయాల్సి ఉంది.
అయితే ప్రస్తుతం బిజీగా ఉన్నామని, మాకు ఇతర పనులు కూడా ఉన్నాయంటూ రుణాల కోసం వెళితే బ్యాంక్ అధికారులు కసురుకుంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా కట్టిన రుణాలను కూడా క్రెడిట్ చేస్తూ ఆలస్యంగా సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్న కారణంగా మహిళలు నష్టపోతున్నారు.
ఇందిరా క్రాంతి పథం అధికారులు బ్యాంక్కు వచ్చినప్పుడు సంఘాల వారు రాలేదని, సంఘాల వారు వచ్చినప్పుడు అధికారులు రాలేదని సాకులు చెబుతూ పదే పదే తిప్పుతుండటంతో ఒక్కసారిగా మహిళలంతా ఏకమయ్యారు. కొత్తపల్లె, సోములవారిపల్లె, నంగనూరుపల్లె, దొరసానిపల్లె తదితర గ్రామ పంచాయతీల పరిధిలోని స్వయం సహాయకసంఘాల మహిళలంతా తరలి వచ్చారు. వీరంతా బ్యాంక్ ఆవరణలోకి రావడంతో పరిస్థితిని గమనించిన బ్యాంక్ మేనేజర్ అనంతకుమార్, ఫీల్డ్ ఆఫీసర్ రాఘవేంద్రలు బయటికి వచ్చి వీరితో మాట్లాడారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ న్యూస్లైన్తో మాట్లాడుతూ తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని, ఈ సమస్య తన దృష్టికి రాలేదని తెలిపారు. వీలైనంత త్వరలో అర్హులకు రుణాలు మంజూరు చేస్తామన్నారు.
రుణం
Published Thu, Jan 30 2014 2:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
నల్లమలలోగుప్తనిధుల వేట
10న ప్రధాని మోదీ రాక
సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
లక్ష్యం.. బహుదూరం
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
జూనియర్ ఏషియన్విజేతకు సన్మానం
ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
వంశీచంద్ అభ్యర్థి కాదు.. రేవంత్ షాడో
ఈవీఎంల స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ట బందోబస్తు
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement