అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ | robbery gang arrested in krishna distirict | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Aug 6 2015 3:22 PM | Updated on Aug 30 2018 5:27 PM

అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురు దొంగలను కైకలూరు రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

కైకలూరు: అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురు దొంగలను కైకలూరు రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీఐ జి. మురళీకృష్ణ విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం మసీడుపాడుకు చెందిన గురువిందుల వెంకటరమణ, చామలపూడి మోహన్, సూర్యనారాయణ ఆలయాల్లో హుండీలను దొంగలించేవారు. వీరిపై కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పలు కేసులు ఉన్నాయి. గురువారం ఉదయం రెండు హుండీలతో వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.15 రూపాయల నగదు రెండు హుండీలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement